ఇండియాలోనే నెంబర్-2.. షారుఖ్ తర్వాత పవన్ కల్యాణే!

by Disha Web Desk 6 |
ఇండియాలోనే నెంబర్-2.. షారుఖ్ తర్వాత పవన్ కల్యాణే!
X

దిశ, వెబ్‌డెస్క్: పలువురు సెలబ్రీటీలు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. అయితే ట్విట్టర్‌లో జూలై నెలలో ఎక్కువగా చర్చించుకున్న భారతీయుల అకౌంట్స్‌లో టాప్-10 ఉన్న వారి జాబితాను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకే ఒక్కడు ఉన్నట్లు వెల్లడించింది.

మొత్తంగా భారత్‌లో ప్రధాని మెడీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్‌లు వరుసగా మూడు స్థానాల్లో ఉండగా.. సునీల్ ఛైత్రీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఎల్విష్ యాదవ్, పవన్ కల్యాణ్, సీఎం యోగి ఆధిత్యనాథ్, నటులు ఆ తర్వాత తమిళ హీరోలు సూర్య, విజయ్‌లు ఉన్నారు. దీంతో ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇన్‌స్టాలోకి అడుగుపెట్టడం, గంటల వ్యవధిలోనే మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుని కొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఆయను ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్‌ కంప్లీట్ చేస్తూనే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Read More: ప్లీజ్ నన్ను ఆ పేర్లతో పిలవొద్దు.. ఇంకా నా పని అయిపోలేదు: Anupam Kher

Next Story

Most Viewed